Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు..

ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు అభిమానులు  మునుగోడు క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  జన్మదిన వేడుకలను ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి నేతృతంలో యువజన కాంగ్రెస్  ఆధ్వర్యంలో  నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించి , రక్తదానం చేసిన యువకులకు బ్లడ్ డొనేట్ పత్రాలను అందజేశారు. జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు స్వయంగా వడ్డించారు.జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి తో పాటు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణిలు మునుగోడు క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆర్ ఎల్ సైదులు మండల కేంద్రంలోని చండూర్ రోడ్ లోని పెట్రోల్ బంక్ పక్కన అతిపెద్ద ఫ్లెక్సీ ని ఏర్పాటుచేసి ఎమ్మెల్యేతో కేక్ కటింగ్ చేయించారు . తమపై అభిమానంతో వచ్చిన కార్యకర్తలకు , అభిమానులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, టిపిసిసి జనరల్ సెక్రెటరీ పున్నం కైలాస్ నేత , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెదిరె మెగా రెడ్డి, నారబోయిన రవి ముదిరాజ్ , వట్టి కోటి శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ , మేడి నాగలక్ష్మి యాదయ్య , మాజీ సర్పంచులు మిర్యాల వెంకటేశ్వర్లు , జాల వెంకన్న యాదవ్ , తాడికొండ సైదులు , జక్కల శ్రీను యాదవ్ , నియోజవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు , మాజీ జడ్పిటిసిలు , ఎంపీపీలు, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -