Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామంలోని పెద్ద చెరువు ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదివారం సాయంకాలం పరిశీలించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెద్ద చెరువు కాలువ పూడి, కంప చెట్లతో పడావు పడింది. దాదాపు 20 ఏళ్ల నుండి పడావుపడ్డ ఈ కాలువను పట్టించుకునే నాయకుడు లేక పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యేగా తోట గెలిచిన అనంతరం ఈ సమస్య తన దృష్టికి రావడంతో.. వెంటనే కాలువ మరమ్మత్తు పనులు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు కాలువ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే చెరువు ఆయకట్టు కింద సుమారు 600 ఎకరాల దాకా పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయి పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -