- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వారం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలతో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. స్వామి వారి ఆశీస్సులతో జుక్కల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మండలంలోని పలు మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



