- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి అభివృద్ధికి సహకరించాలని, జుక్కల్ నియోజకవర్గాన్ని సందర్శించేందుకు రావాలని ఎమ్మెల్యే కోరినట్లు సమాచారం. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు.
- Advertisement -