- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన సతీమణి పైడి రేవతి రెడ్డి,కుమార్తె సుచరిత రెడ్డి తో శనివారం ఆదివాసీ గిరిజన వన దేవతలు అయిన శ్రీ సమ్మక్క సారక్క దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకొని నిలువెత్తూ బంగారం తో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అతిపెద్ద గిరిజన వన మహోత్సవ జాతర అని సంస్కృతి సప్రదాయాలు హిందూ దేవతలలో ఉన్నాయి ప్రతి ఒక్క పండుగ పకృతితో ముడిపడి ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుజాత రెడ్డి, సంతోష్ రెడ్డి, వ్యక్తిగత సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



