- Advertisement -
– ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డ్రగ్స్ టెస్టు చేయించుకోని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావొద్దనిజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టులు 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సినిమాలు రిలీజ్ చేయాలనీ, టెస్ట్ చేయించుకోక పోతే సినిమాల రిలీజ్కు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు.రాజకీయ నాయకులు కూడా విధిగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
- Advertisement -



