- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, వాసుదేవుల పుల్లారెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి వాసుదేవుల రంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం నల్గొండ జిల్లా శాసన మండలి సభ్యులు ఉట్లపల్లి గ్రామంలో వారిని కలిసి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హాలియా పట్టణ బిఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి, నెమలి వెంకట్ రెడ్డి, తోడిమా వల్లపరెడ్డి, జైపాల్ రెడ్డి పరామర్శించిన వారిలో ఉన్నారు.
- Advertisement -



