నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గురువారం మున్సిపల్, రెవెన్యూ, ఎస్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖల అధికారులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
మామిడిపల్లిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆట పోటీలలో పాల్గొనే విద్యార్థి విద్యార్థులను కరచాలనం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, తహసిల్దార్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు కోన పత్రి కాశీరాం, తవ్వన్న, పాఠశాల ప్రాధ నొపాధ్యాయులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.