– 140కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం : ప్రధాని మోడీ
నికోసియా: ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ సైప్రస్ పర్యటనలో ఉన్న మోడీకి, అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సైప్రస్ అధ్యక్షుడు ప్రదానం చేసిన ఈ పురస్కారం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అన్నారు. రెండు దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబం భావనకు ప్రతీక అని తెలిపారు. ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు ఈ పురస్కారం అందించిన నికోస్ క్రిస్టోడౌలిడెస్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3 అనేది సైప్రస్ మొదటి అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మకారియోస్ 3 పేరు మీద అందించే పురస్కారం. తమ దేశానికి చేసిన ప్రతిభావంతమైన సేవకు గుర్తింపుగా దేశాధినేతలు, ముఖ్యమైన హౌదా కలిగిన వ్యక్తులకు దీనిని ప్రదానం చేస్తారు.
కొత్త శిఖరాలకు రెండు దేశాల సంబంధాలు
రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ”రాబోయే కాలంలో మన క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. రెండు దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా శాంతియుత, సురక్షితమైన ప్రపంచ వాతావర ణాన్ని నిర్మించడంలో కూడా దోహదపడతాం” అని మోడీ చెప్పారు.ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు ”విశ్వసనీయ భారత్- సైప్రస్ స్నేహానికి, 1.4 బిలియన్ల భారతీయ ప్రజలకు ఈ అవార్డు అంకితం. ఈ గౌరవం రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని, కలిసి పనిచేయడానికి ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
నేడు జీ-7 సదస్సు..కెనడాకు మోడీ పయనం
రెండు రోజుల సైప్రస్ పర్యటనను ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కెనడా బయలుదేరారు. మంగళవారం అల్బర్టాలోని కననాస్కిస్లో జరిగే 51వ జీ-7 సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే మొదటిసారి. మెడిటెర్రానియన్ ప్రాంతంలోనూ, యూరోపియన్ యూనియన్లోనూ భారత్కు సైప్రస్ సన్నిహిత స్నేహితునిగా, ముఖ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ‘మోడీ చారిత్రక పర్యటన రెండు దేశాల మధ్య నెలకొన్న స్నేహ సంబంధాలను, విశ్వసనీ య భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతోంది. ద్వైపాక్షిక భాగస్వామ్యపు వ్యూహాత్మక దిశ గురించి మోడీ మీడియాకు తెలియజేశారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, మెడిటెర్రానియన్ ప్రాంతంలో పెరగుతున్న భారత్ ప్రాధాన్యత దృష్ట్యా ఈ భాగస్వామం ప్రాధాన్యతను సంతరించుకుంది’ అని ప్రధాని పర్యటన ముగింపు సందర్భంగా సైప్రస్ విదేశాంగ శాఖ కార్యదర్శి తన్మయ లాల్ చెప్పారు. భారత్, సైప్రస్ మధ్య సోమవారం పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇవి దోహదపడతాయని అధికారులు తెలిపా రు. అంతకుముందు ప్రధాని మోడీకి సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడస్ దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మాల్కోరియస్-3’ని అధ్యక్ష భవనంలో అందజేశారు. పురస్కారాన్ని అందుకోవడానికి అధ్యక్ష భవనానికి వచ్చిన మోడీకి నికోస్ ఘనస్వాగతం పలికారు.
మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES