Sunday, June 1, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మిక హక్కులపై మోడీ దాడి

కార్మిక హక్కులపై మోడీ దాడి

- Advertisement -

– నియంతృత్వ పోకడలను ఐక్యంగా ప్రతిఘటించాలి : సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
– జులై 9న సార్వత్రిక సమ్మె
– కార్మికులందరూ భాగస్వాములు కావాలి
– తెలంగాణలో బంద్‌ను తలపించాలి
– లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
– హైదరాబాద్‌లో సీఐటీయూ రాష్ట్ర నూతన కార్యాలయం (ఎన్‌వి.భాస్కరరావు స్మారక కేంద్రం) ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మోడీ ప్రభుత్వానికి సవాల్‌ విసిరేలా జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సీఐటీయూ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. చరిత్రలో అతిపెద్ద సమ్మెగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్మికుల హక్కులు, దేశ ప్రయోజనాల కోసం చేపట్టే ఈ సమ్మెలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని కోరారు. జులై9న తెలంగాణ బంద్‌ జరిగేలా కార్యాచరణను రూపొందించాలని చెప్పారు.శుక్రవారం హైదరాబాద్‌లో సీఐటీయూ నూతన కార్యాలయాన్ని(ఎన్‌.వి.భాస్కరరావు స్మారక కేంద్రం) తపన్‌సేన్‌ ప్రారంభించారు. ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొ ని సీనియర్‌ నేత పి.రాజారావు సీఐటీయూ జెండాను ఎగురవేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం మొదటి అంతస్తును ఆ యూనియ న్‌ ఉమ్మడి ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులు, రెండో అంతస్తును ఆ యూని యన్‌ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, మీటింగ్‌ హాల్‌ను అఖిల భారత కోశాధికారి ఎం. సాయిబాబు, గెస్ట్‌ రూమ్‌లను అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్‌.లక్ష్మయ్య, సోషల్‌ మీడియా స్టూడియోను ఏపీ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌. నర్సింగరావు, లైబ్రరీని సీఐటీయూ పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్‌, డైనింగ్‌ హాల్‌ను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య, మినీ కన్వెన్షన్‌ హాల్‌ను సీఐటీయూ పూర్వ అధ్యక్షులు ఆర్‌. సుధాభాస్కర్‌ ప్రారంభించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చుక్కరాములు అధ్యక్షతన జరిగిన సభలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. కార్మికుల ఐక్యత, పోరాటమే సీఐటీయూ లక్ష్యమని అన్నారు. ఈ సంఘాన్ని ఒంటరిపాలు చేసేందుకు పాలకులు అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. దేశంలో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి సార్వత్రిక సమ్మెలను నిర్వహించిన ఘనత సీఐటీయూకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు 22 సమ్మెలు జరిగాయనీ, జులై 9న చారిత్రక సమ్మె జరగబోతున్నదని వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమాలను ముందుకుతీసుకుపోవడమే లక్ష్యమని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం కాల రాస్తున్నదని విమర్శిం చారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలకు హక్కుల్లేకుండా చేసేందుకు లేబర్‌ కోడ్‌లను కేంద్రం తెస్తున్నదని అన్నారు. ఈ లేబర్‌ కోడ్‌లను కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను ప్రయివేటు పరం చేస్తున్నదనీ, దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. దాన్ని ప్రతిఘటించాలని చెప్పారు. కార్మికులు విజయం సాధించే వరకూ పోరాడాలన్నారు. దేశంలో కార్మిక సంఘాల్లేకుండా చేయాలని మోడీ సర్కారు చూస్తున్నదని అన్నారు. అది సాధ్యం కాదని చెప్పారు. జులై 9న సార్వత్రిక సమ్మెలో కార్మికులు ఐక్యతను ప్రదర్శించాలనీ, ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా చూడాలని కోరారు. ప్రధాని మోడీ ఏసీ గదుల్లో కూర్చుని తింటున్న భోజనం, వేసుకునే బట్టలు, అనుభవిస్తున్న ఇతర వస్తువులు కార్మికులు, శ్రమజీవులు ఉత్పత్తి చేస్తున్నవేనని అన్నారు. దేశంలో 12 గంటల పనివిధానం కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నదని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. మహిళా కార్మికులపై లైంగిక దాడులు జరుగు తున్నాయని వివరించారు. హిట్లర్‌, ముస్సోలినితోపాటు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ నియంతృత్వంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రజాగ్రహానికి గురయ్యారని చెప్పారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నదని విమర్శించారు. నియంతృత్వ పాలనను ప్రజలు, కార్మికులు, శ్రమజీవులు ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.
సీహెచ్‌. నర్సింగరావు మాట్లాడుతూ… ఎన్‌విబి స్మారక కేంద్రం శ్రమజీవుల పోరాట కేంద్రంగా వర్థిల్లాలని ఆకాంక్షించారు. సీఐటీయూ ఏపీ కమిటీ నుంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యాలయం నుంచే తాము యూనియన్‌ నేతలుగా ఎదిగామని గుర్తుచేశారు. నూతన భవనానికి భాస్కర్‌రావు పేరు పెట్టడం సంతోషదాయకమన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ..కార్మికులకు కనీస వేతనం లేదనీ, రైతులకు ఎమ్‌ఎస్‌పీ లేదని చెప్పారు. వ్యవసాయ కార్మికులకు ఉన్న ఉపాధిని తీసేసే ప్రయత్నం జరుగుతున్నదని వాపోయారు. కార్మిక, కర్షక ఐక్యత కోసం దేశవ్యాప్తంగా జరిగే కృషి తెలంగాణలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
సీఐటీయూ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..కార్మికుల శ్రమతో నిర్మించిన ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామమన్నారు. నిజాయితీగా, బాధ్యతగా పోట్లాడి హక్కులు సాధించే యూనియన్‌ సీఐటీయూ అనే ముద్ర కార్మికులు, ఉద్యోగ వర్గాల్లో బలంగా ఉందన్నారు. పరిశ్రమల్లో పెట్టుబడిదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోటీచేసినా సీఐటీయూ నేతలను, కార్మికులను గెలిపించడం యూనియన్‌ నాయకత్వంపై ఉన్న నమ్మకమే కారణమని చెప్పారు. అఖిల భారత ఉపాధ్యక్షులు ఆర్‌.లక్ష్మయ్య మాట్లాడుతూ…ఎన్‌విబి కేంద్రం బలమైన కార్మిక వర్గ పోరాటాల రూపకల్పనకు అడ్డాగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్‌వి.భాస్కర్‌రావు కూతురు నిర్మల మాట్లాడుతూ..సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటుకు కుటుంబం తరఫున తమ వంతు సహకారం అందిస్తామని హామీనిచ్చారు.
సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ…పూర్తిగా కార్మికుల నుంచి సేకరించిన విరాళాల ద్వారానే సీఐటీయూ రాష్ట్ర కార్యాలయమైన ఎన్‌వి.భాస్కరరావు స్మారక కేంద్రాన్ని నిర్మించామని తెలిపారు. నిర్మాణంలో సహకరించిన ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక, కర్షక మైత్రిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయా కంపెనీల కార్మిక యూనియన్లు, సీఐటీయూ జిల్లా కమిటీలు, స్కీమ్‌ వర్కర్ల సంఘాలు అందించిన వివరాల జాబితాను వివరించారు. మేడ్చల్‌, సంగారెడ్డిలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సహకరించిన పారిశ్రామిక కార్మికుల కృషిని వివరించారు. శుక్రవారం పలు కంపెనీల కార్మికులు ఇచ్చిన విరాళాలను స్వీకరించారు. కార్మికవర్గ పోరాట కేంద్రమైన రాష్ట్ర కార్యాలయం నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు వందన సమర్పణ చేశారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఏపీ సీఐటీయూ అధ్యక్షులు ఎ.వి. నాగేశ్వరరావు, ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత కుమారుడు జశ్వంత్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, ఎస్వీ.రమ, పి.జయలక్ష్మి, కళ్యాణం వెంకటేశ్వరరావు, టి.వీరారెడ్డి, జె.మల్లిఖార్జున్‌, వీఎస్‌.రావు, కె.ఈశ్వర్‌రావు, టి.రాజారెడ్డి కార్యదర్శులు జె.వెంకటేశ్‌, ఎం.పద్మశ్రీ, ఎ.ముత్యంరావు, జె.చంద్రశేఖర్‌, ఎం.వెంకటేశ్‌, బీరం మల్లేశ్‌, ఎ.జె.రమేశ్‌, రాగుల రమేశ్‌, కూరపాటి రమేశ్‌, పుప్పాల శ్రీకాంత్‌, కె.గోపాలస్వామి, కాసు మాధవి, సీనియర్‌ నేతలు కోటంరాజు, మాజీ ఆఫీసు బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.

కార్మికవర్గానిది మానవతాదృక్పథం : ఎస్‌.వీరయ్య
పహల్గాం ఘటన కార్మిక వర్గ స్ఫూర్తి ఏంటో చూపెట్టిందని ఎస్‌.వీరయ్య అన్నారు. అక్కడి హమాలీలు, ఆటో, క్యాబ్‌, బస్సు డ్రైవర్లు అంతా ముస్లింలనీ, పర్యాటకులను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులకు ఉచితంగా తరలించడంలో వారి పాత్ర మరువలేనిదన్నారు. అదే సమయంలో విమానయాన సంస్థలు చార్జీలను రెట్టింపు చేసి దోచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పెట్టుబడిదారులకు లాభాలే తప్ప మానవత్వం ఉండదనీ, కార్మికవర్గం ఎప్పుడూ మానవతాదృక్పథంతో ఉంటుందని సమాజానికి చెప్పిన ఘటన అది అని చెప్పారు.

కార్మిక శక్తి వినియోగంపై దృష్టి సారించాలి : ఎం.సాయిబాబు
సీఐటీయూకి జాతీయోద్యమ, తెలంగాణ సాయుధ పోరాట, సమరశీల పోరాటాల వారసత్వముందని ఎం.సాయిబాబు చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదట కార్మికవర్గ పక్షాన పోరాడుతున్న సీఐటీయూని చీల్చడమే లక్ష్యంగా ముందుకెళ్లాయని గుర్తుచేశారు. అయస్కాంతాలను ఎన్ని ముక్కలు చేస్తే అన్ని ఉత్తర, దక్షిణ ధృవాలు ఏర్పడుతాయనీ, అలాగే సీఐటీయూ మరింత బలోపేతమైందని చెప్పారు. కార్మిక శక్తిని వినియోగించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ…పూర్తిగా కార్మికుల నుంచి సేకరించిన విరాళాల ద్వారానే సీఐటీయూ రాష్ట్ర కార్యాలయమైన ఎన్‌వి.భాస్కరరావు స్మారక కేంద్రాన్ని నిర్మించామని తెలిపారు. నిర్మాణంలో సహకరించిన ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక, కర్షక మైత్రిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయా కంపెనీల కార్మిక యూనియన్లు, సీఐటీయూ జిల్లా కమిటీలు, స్కీమ్‌ వర్కర్ల సంఘాలు అందించిన వివరాల జాబితాను వివరించారు. మేడ్చల్‌, సంగారెడ్డిలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సహకరించిన పారిశ్రామిక కార్మికుల కృషిని వివరించారు. శుక్రవారం పలు కంపెనీల కార్మికులు ఇచ్చిన విరాళాలను స్వీకరించారు. కార్మికవర్గ పోరాట కేంద్రమైన రాష్ట్ర కార్యాలయం నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు వందన సమర్పణ చేశారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ఏపీ సీఐటీయూ అధ్యక్షులు ఎ.వి. నాగేశ్వరరావు, ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ అధినేత కుమారుడు జశ్వంత్‌, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, ఎస్వీ.రమ, పి.జయలక్ష్మి, కళ్యాణం వెంకటేశ్వరరావు, టి.వీరారెడ్డి, జె.మల్లిఖార్జున్‌, వీఎస్‌.రావు, కె.ఈశ్వర్‌రావు, టి.రాజారెడ్డి కార్యదర్శులు జె.వెంకటేశ్‌, ఎం.పద్మశ్రీ, ఎ.ముత్యంరావు, జె.చంద్రశేఖర్‌, ఎం.వెంకటేశ్‌, బీరం మల్లేశ్‌, ఎ.జె.రమేశ్‌, రాగుల రమేశ్‌, కూరపాటి రమేశ్‌, పుప్పాల శ్రీకాంత్‌, కె.గోపాలస్వామి, కాసు మాధవి, సీనియర్‌ నేతలు కోటంరాజు, మాజీ ఆఫీసు బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.

నాలుగో స్థానం సరే…కార్మికుల బతుకుల గురించి మాట్లాడరే..: ఎం.ఎ.గపూర్‌
మోడీ హయాంలో దేశం వెలిగిపోతున్నదనీ, ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగిందని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమని ఎం.ఏ.గపూర్‌ విమర్శించారు. కొందరి చేతుల్లోనే సంపద పోగైతే దేశం గ్రోత్‌ పెరిగినట్టు కాదని స్పష్టం చేశారు. దేశంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కార్మికుల బతుకుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సంపద పోగుపడకుండా కార్మికులకు చేరినప్పుడే, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే నిజమైన ఆర్థిక వృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు. పెట్టుబడిదారులకు పాలకులు ఊడిగం చేస్తున్న తీరును వివరించారు.
మాది త్రిబుల్‌ ఇంజిన్‌ టీం : బి.వెంకట్‌
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ..సీఐటీయూ పాత భవనంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సీఐటీయూ ఆఫీసు శ్రామిక వర్గానికి కేంద్రంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ వంటి ఉత్పత్తి వర్గ సంఘాలు కలిసికట్టుగా మరింత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ధనికులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు. మోడీ-అమిత్‌షాలు, అంబానీ-అదానీలది డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అయితే రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులది త్రిబుల్‌ ఇంజిన్‌ టీం అని నొక్కి చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుపై త్రిబుల్‌ ఇంజిన్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువ కార్మికుల్ని సంఘటితం చేయాలి : బీవీ రాఘవులు
యువ కార్మికుల్ని సంఘటితం చేయాల్సిన ఆవశ్యకతను బీవీ.రాఘవులు నొక్కి చెప్పారు. కార్మికులందర్నీ ఒకే వేదికపై తీసుకొచ్చి ఐక్య పోరాటాలు చేయాలనే స్ఫూర్తిని సీఐటీయూ కొనసాగిస్తున్నదని చెప్పారు. కార్మికవర్గానికి ఎల్లలు, కులం, మతం ఉండబోవని స్పష్టం చేశారు. దేశంలో కొందరు ఉన్మాదాన్ని, దురంహకారాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. పహల్గాం ఉగ్రవాద ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. అయితే, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని నొక్కి చెప్పారు. యుద్ధం వల్ల శాంతికి, ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని స్పష్టం చేశారు. ఉన్మాదాలను రెచ్చగొడితే మొట్టమొదట దెబ్బతగిలేది కార్మికవర్గానికే అని నొక్కిచెప్పారు.
బలమైన పోరాటాలు నిర్మించాలి : కె. హేమలత
కార్మికవర్గాన్ని, శ్రమజీవులను సంఘటితం చేసి రాబోయే రోజుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలను నిర్మించాలని కె హేమలత పిలుపునిచ్చారు. సీఐటీయూను విప్లవ కార్మిక సంఘంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఎన్‌వీ భాస్కర్‌రావు స్మారక కేంద్రం రాష్ట్రంలో కార్మికోద్యమాలకూ కేంద్రంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఐటీయూ మరింత సమన్వయంతో, సమర్థవంతంగా కార్మికుల హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం జరుగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కోడ్‌లు కార్మికుల హక్కులను కాలరాసి బానిసల్ని చేసే ప్రమాదముందని హెచ్చరించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -