- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ ఐ వినోద్, శేఖర్, ఎస్ ఐ రాహుమతుల్లా , ఆర్ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బంది కి 20 ట్రాఫిక్ బారికేడ్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఏసిపి మస్తాన్ అలీ మాట్లాడుతూ.. ఈ బారికేడ్లను నగరంలోని ట్రాఫిక్ ను నియంత్రించడానికి, బందోబస్తులకు, రోడ్ పైన ఇతర అవసరాల కొరకు ఉపయోగిస్తామని తెలిపారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మిగతా హాస్పిటల్స్ యాజమాన్యం వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని తెలిపారు.
- Advertisement -