- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట : ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి వారి ఖాతాలలో రూ.1 లక్ష చొప్పున జమ అవుతున్నట్లు హౌసింగ్ అధికారి ఆనంద రెడ్డి తెలిపారు. జిన్ కుంతలో 14, మిట్ట సధకుడులో -10, మొలగర -3, గోకారం -4, తుల్కపల్లిలో 4, అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు బేస్మెంట్ పూర్తి చేసుకున్న 35 మంది లబ్ధిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆన్లైన్లో వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వమే ఆన్లైన్ విధానంలో లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం జమ చేస్తున్నట్టు తెలిపారు.
- Advertisement -