- Advertisement -
హైదరాబాద్ : వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమంలో, రాబడి, భద్రత, లిక్విడిటీని సమతుల్యం చేసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు మనీ మార్కెట్ ఫండ్లు ఆకర్షనీయమైన ఎంపికగా మారుతున్నాయని టాటా అసెట్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ అసెట్ డిప్యూటీ హెడ్ అమిత్ సోమానీ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు మనీ మార్కెట్ ఫండ్లలో రెపో కంటే అదనంగా 50-75 బేసిస్ పాయింట్లను సంపాదించవచ్చన్నారు. మనీ మార్కెట్ ఫండ్లు ట్రెజరీ బిల్లులు, వాణిజ్య పత్రాలు మరియు డిపాజిట్ సర్టిఫికెట్లు వంటి సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ఇవి స్థిరత్వం, రాబడి మధ్య సమతుల్యతను అందిస్తాయన్నారు.
- Advertisement -