Tuesday, June 10, 2025
E-PAPER
Homeబీజినెస్ఎంఎస్‌ఎంఇ వ్యాపారులకు మరింత మద్దతు

ఎంఎస్‌ఎంఇ వ్యాపారులకు మరింత మద్దతు

- Advertisement -

– షిప్‌రాకెట్‌ సీఈఓ అతుల్‌ మెహతా వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్‌

ఎంఎస్‌ఎంఇ వ్యాపారాలకు మరింత మద్దతును అందించనున్నామని షిప్‌రాకెట్‌ సీఈఓ (డొమెస్టిక్‌ షిప్పింగ్‌) అతుల్‌ హెహతా అన్నారు. చిన్న వ్యాపారాల ఉత్పత్తుల రవాణ, అమ్మకాలకు సొల్యూషన్స్‌ను అందిస్తున్నామన్నారు. ఆ వర్గాలకు మరింత చేరువ కావడానికి హైదరాబాద్‌లో షిిప్‌రాకెట్‌ యాత్ర 2025ను నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతుల్‌ మెహతా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎస్‌ఎంఈ వర్తకులకి అవసరమైన సాధనాలు, సాంకేతికతను సమకూర్చడంపై అవగాహన పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం డెలివరీకి మూడు రోజులు పడుతోందన్నారు. త్వరలోనే ఇక్కడ గోడౌన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా డెలివరీ సమయాన్ని మూడు గంటలకు తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ”తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటివరకు షిప్‌రాకెట్‌ ప్లాట్‌ఫాంలో 18,000 మంది పైగా విక్రేతలు చేరారు. తద్వారా ఈ రెండు రాష్ట్రాలు షిప్‌రాకెట్‌కు వ్యూహాత్మక మార్కెట్లుగా ఆవిర్భవించాయి. ఈ విక్రేతలు మొత్తం మీద 2 కోట్ల షిప్‌మెంట్లకు దోహదపడ్డారు. 2024-25లో తెలుగు రాష్ట్రాల నుంచి షిప్‌మెంట్ల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 25 శాతం వృద్ధితో 35 లక్షల పైగా షిప్‌మెంట్ల స్థాయికి చేరింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. డ్రోన్‌లతోనూ డెలివరీ సేవలను అందుబాటులోకి తేనున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -