- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి : అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా బుదవారం డిచ్ పల్లి మండలంలోని మేంట్రాజ్ పల్లి గ్రామంలో పిల్లలు తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 10నుండి 17 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. 3 సంత్సరాల లోపు చిన్నారులందరిని అంగన్వాడి కేంద్రాలకు పంపాలని, వారికి నూతని విద్యా విధానం ప్రకారం ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అంగన్వాడీ కార్యకర్తలు సూచించారు. చిన్నారులకు షోష్టికాహారంతో పాటు ఇతర కార్యములు, ఆటలు, పాటలు బోధించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -