Wednesday, December 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'మోగ్లీ' ట్రైలర్‌ రిలీజ్‌

‘మోగ్లీ’ ట్రైలర్‌ రిలీజ్‌

- Advertisement -

హీరో రోషన్‌ కనకాల తన రెండవ చిత్రంగా ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. మంగళవారం కథానాయిక రష్మిక మందన్న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. ట్రైలర్‌ విలన్‌ పాత్రను పోషించిన బండి సరోజ్‌ కుమార్‌ పరిచయంతో ప్రారంభమవుతుంది. కథనం మోగ్లీ ప్రశాంతమైన ప్రపంచానికి మారుతుంది. అతని గర్ల్‌ ఫ్రెండ్‌, చెవిటి-మూగ డ్యాన్సర్‌, అడవిలో షూటింగ్‌ చేస్తున్న ఫిల్మ్‌ యూనిట్‌లో భాగం. దర్శకుడు ఆమెతో ఫ్లిర్ట్‌ చేయడానికి ప్రయత్నించినప్పుడు, మోగ్లీ వార్నింగ్‌ ఇస్తాడు. సరోజ్‌ కుమార్‌ ఆ ప్రాంతంలో పోస్టింగ్‌ కావడం, ఆ అమ్మాయి పట్ల అతనికి ఉన్న ఆసక్తితో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఆమెను రక్షించాలని నిశ్చయించుకున్న మోగ్లీ యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈనెల 12న విడుదల కానున్న ఈ చిత్రంపై ట్రైలర్‌ అంచనాలని భారీగా పెంచింది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -