బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాని హామీ
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : కాటారం మండలం గంగారం ఎస్సీ కాలని లో కారు బీభత్స జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆదివారం ఘటన స్థలాన్నీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పరిశీలించారు. యాక్సిడెంట్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి గంట అవుతున్న పోలీసులు స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ కిరణ్ కరే కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.ఫోన్ చేసిన ఎందుకు స్పందించడం లేదని ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రింక్ చేసి రాష్ డ్రైవింగ్ పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన మృతదేహాలను, తీవ్ర గాయాలపాలైన కుటుంబ సభ్యులను పరమర్శించి ఓదార్చారు. భాదితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాలని వాసులు దళితులమనే చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. రోడ్డుపై మృతదేహాలు రెండు గంటలు ఉన్న కనీసం పోలీసులు రాలేదని ఆవేదన చెందారు.
కారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES