నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పలు గ్రామాలలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్,ఎంపీవో రామ్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి మంగళవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలోనీ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫార్మేషన్ రోడ్డు నూతనంగా వేయడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రంలోని ఈజిఎస్ నర్సరీని ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు.
బంగారు పల్లి మోడల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా స్లాబులు వేసే ఇందిరమ్మ గృహాలను ఎంపీడీవో పరిశీలించారు. లాడేగావ్ గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ గృహ పథకాలలో మంజూరైన ఇండ్లకు ఎంపీ ఓ రాము మార్కోటి ఇచ్చి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ పథకంలో మంజీరైన లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.