- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ ) : రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామపంచాయతీలో జరుగుతున్న ఫార్మేషన్ రోడ్ పనులను ఎంపీడీవో బాలకృష్ణ పరిశీలించారు. పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నాణ్యత పరంగా సూచనలు చేశారు. అనంతరం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్మికులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పనులు నిర్వహించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో, టి ఏ, ఉపాధి హామీ కూలీలు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



