Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీఓ

యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎమ్ సత్యనారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని సుమారుగా 4వేల 3 వందల మంది విద్యార్థుల స్కూలు యూనిఫామ్ లు కుట్టడానికి మండలం మహిళా సంఘాలకు విద్యాశాఖ ద్వారా కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. నేటికీ 85% యూనిఫామ్ లను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసామని తెలిపారు. మిగిలినవి కొన్ని త్వరలో అందజేస్తామని తెలిపారు. పెండింగ్ ఉన్న యూనిఫామ్ లను త్వరలోనే స్టిచ్చింగ్ చేసి, విద్యార్థులకు అందజేయాలని సంఘం సభ్యులకు అధికారులు తెలియజేశారు. ఈ సందర్శన కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు సీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -