Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిజ్జల్ వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

బిజ్జల్ వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బిజ్జల్ వాడి గ్రామంలో గురువారం గ్రామ పెద్దలు మాదారావు పటేల్, యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి మార్కౌట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాలలో నిరుపేదలకు ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేశామన్నారు. మంజూరైన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు కచ్చితంగా ఉపయోగించుకోవాలన్నారు. నిర్మాణాలను ప్రారంభించిన వారికి దశల వారీగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందని వెల్లడించారు. నిర్మాణాలలో సాంకేతిక ఇబ్బందులు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి సమస్యలను వివరించాలని సూచించారు. వాటిని వెంటనే పరిష్కరించి సాహయ, సహకారాలు అందిస్తామని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపి కార్యదర్శి , గ్రామ పెద్దలు మాధవ రావు పటేల్, వాగ్మారే యాదవ్ , గ్రామస్తులు , లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -