- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఇప్పటికే ఎంపీఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పలు పంచాయితీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఉత్తర్వులు ప్రకారం గురువారం నారంవారిగూడెం, ఆసుపాక,మల్లాయిగూడెం, నారాయణ పురం పంచాయితీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యత లు స్వీకరించారు. పైన తెలిపిన పంచాయతీలలో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ పి.సీత రామరాజు మే లో పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను సైతం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అప్పగించారు.
- Advertisement -