- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మార్వో సునీత ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల రిజిస్టర్ లను పరిశీలించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,వసతులపై విద్యార్థులతో మాట్లాడారు,అలాగే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించి.విద్యార్థులకు పాఠశాలలో ఎదురవుతున్న ఇబ్బందులు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, చదువుపట్ల విద్యార్థులు కనబరుస్తున్న శ్రద్ధ వంటి వాటిపై ఆరాతీశారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
- Advertisement -