Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

జిల్లా ఇంచార్జీ కందుకూరి సోమన్న మాదిగ
నవతెలంగాణ – పరకాల 
: ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా జిల్లా ఇంచార్జీ కందుకూరి సోమన్న మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎమ్మార్పీఎస్ పరకాల మండల ఇంచార్జీ అంకిల్ల రాజు మాదిగ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జీ కందుకూరి సోమన్న మాదిగ,ఎంఎస్ పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగలు హాజరై మాట్లాడుతూ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితంగానే వర్గీకరణ సాధించుకోవడం జరిగిందన్నారు.మాదిగ జాతి కోసమే కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఫలితాలను సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందన్నారు. జులై 7వ తేదీలోపు ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి గ్రామంలో జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పరకాల మండల కో ఇంచార్జీ సుంచు రజిని కుమార్ మాదిగ,ఎర్ర రాము మాదిగ,బొచ్చు కరుణాకర్ మాదిగ,మేకల దేవన్న మాదిగ,వెల్లంపల్లి శోభన్ మాదిగ,

గోవిందు సురేష్ మాదిగ,ఏకు రవికుమార్ మాదిగ,కొయ్యడ ప్రదీప్ మాదిగ,రామంచ అజయ్ మాదిగ,కొగిల సాయికుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -