- Advertisement -
నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా కాశీరాం ,ప్రధాన కార్యదర్శిగా గంగాధర్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షుడు కోనాపూర్ దాకయ్య మాట్లాడుతూ.. జూలై 07/07/2025 రోజున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో గాంధారి మండల ఇంచార్జ్ కోతోల్ల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -