Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రిలో బాధితుడికి ముదిరాజ్ సంఘం సభ్యుల పరామర్శ..

ఆస్పత్రిలో బాధితుడికి ముదిరాజ్ సంఘం సభ్యుల పరామర్శ..

- Advertisement -

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి  : ఒక వర్గం వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూర్తన మండల కేంద్రానికి చెందిన రొయ్యల సురేష్ ను మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు శనివారం పరామర్శించారు. నాలుగు సంఘాలకు చెందిన పదుల సంఖ్యలో సభ్యులు ఆర్మూర్ లోని ఆసుపత్రికి వెళ్లి సురేష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ పై దాడిని ముదిరాజ్ సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. రోడ్డుపై అడ్డంగా ఉంచిన ద్విచక్ర వాహనాన్ని తొలగించమని కోరితే దాడి చేసి కొట్టడం అమానుషమన్నారు. ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఆస్పత్రుల సురేష్ ను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొత్తపల్లి అశోక్, లోలపు సుమన్, సుంకరి రాజేశ్వర్, కలాలి భానుచందర్, కలాలి కిరణ్, చింతకుంట రాజేష్, కొత్వాల్ శ్రీనివాస్, కొత్వాల్ శివకుమార్, కలాలి రంజిత్, ముదిరాజ్ సంఘ సభ్యులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -