- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
రామారెడ్డి మండల నూతన కాంగ్రెస్ అధ్యక్షునిగా గిద్ద మాజీ ఎంపిటిసి మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ ను నియమిస్తూ టిపిసిసి ఉపాధ్యక్షులు టి కుమార్ రావు ఆర్డర్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి, మండల అధ్యక్షుడిగా నియమించినందుకు ఎల్లారెడ్డి శాసనసభ్యులు కల్వకుంట్ల మాదాద్ మోహన్ రావు కు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -