- Advertisement -
ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ ఫైనల్కు ముంబయి మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ చేరుకున్నాయి. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో గోవా గార్డియన్స్పై 15-8, 15-8, 16-14తో ముంబయి మీటియర్స్ వరుస సెట్లలో ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో సెమీఫైనల్లో నాలుగు సెట్ల థ్రిల్లర్లో 10-15, 15-11, 15-13, 15-13తో అహ్మదాబాద్ డిఫెండర్స్పై బెంగళూరు టార్పెడోస్ ఉత్కంఠ విజయం సాధించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ముంబయి, బెంగళూరు తాడోపేడో తేల్చుకోనున్నాయి.
- Advertisement -



