- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ లోని 41వ వార్డ్ లో ప్రజలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. త్వరితగతిన ఇండ్లను నిర్మించుకొని బిల్లులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కాళ్ళ గణేష్ వార్డ్ ఆఫీసర్ రాజు, మెగ్మ పి డీ శ్రీధర్, సి ఓ అనసూయ, ఆర్ పి ఉమామహేశ్వరి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



