- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రాజీవ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించగా ఫుడ్ ఫెస్టివల్ను మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ శనివారం సందర్శించి అడిగి తెలుసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు స్వయంగా తయారుచేసిన ఆహార ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -