- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొదటి దశలో 55 కి.మీ మేర ఈప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుందని తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఐదు జోన్లుగా విభజన జరిగిందన్నారు.
- Advertisement -



