చాలా దూరం వెళ్లిన ట్రంప్పై పెట్టిన పోస్టులు
టెస్లా అధినేత యూ-టర్న్… అధ్యక్షుడితో సయోధ్యకు యత్నాలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై నిన్నటి వరకూ పలు ఆరోపణలు సంధించి ధ్వజమెత్తిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు సయోధ్య కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ట్రంప్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు విచారం వ్యక్తం చేశారు. ‘అవి చాలా దూరం వెళ్లాయి’ అని వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యయ బిల్లుకు అనుకూలంగా ఓటేసే రిపబ్లికన్లను శిక్షిస్తానంటూ మస్క్ చేసిన ప్రకటనపై ట్రంప్ మండిపడ్డారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మస్క్ యూ-టర్న్ తీసుకున్నారు. మస్క్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో ‘గత వారం అధ్యక్షుడు ట్రంప్ గురించి పెట్టిన కొన్ని పోస్టులపై విచారం వ్యక్తం చేస్తున్నాను. అవి చాలా దూరం వెళ్లాయి’ అని తెలిపారు. ట్రంప్, మస్క్ మధ్య సంబంధాలు గత వారం బాగా దెబ్బతిన్నాయి. ఇరువురూ సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, హెచ్చరికలు చేసుకున్నారు.
వేగంగా మారిన పరిణామాలపై పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొని 2019లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్లో ట్రంప్ పేరు ఉన్నదని, అందుకే అవి బయటికి రావడం లేదని మస్క్ చేసిన ఆరోపణతో వాతావరణం వేడెక్కింది. మస్క్ ఆరోపణపై ట్రంప్ ఘాటుగానే స్పందించారు. మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్, ఉపగ్రహ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత మస్క్ తన పోస్ట్ను తొలగించిన సంగతి తెలిసిందే.
‘సారీ’ చెప్పిన మస్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES