నా చివరి శ్వాస వరకు పోరాటం చేసైనా దాన్ని పూర్తి చేస్తా..
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నవతెలంగాణ – కామారెడ్డి : నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం ) నా చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రాణహిత చేవెళ్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతే నేను కన్నుమూస్తానని అన్నారు. రూ.23 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, వెంటనే నిధులు మంజూరు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్కలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చి దాన్ని పూర్తిగానే రద్దు చేయాలని కుట్ర పన్నిందన్నారు. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ గా మార్చింది. దీని ద్వారా పేద రైతుల 3.5 టిఎంసి నీటి పరిధితో వందల ఎకరాల భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.10 కోట్లు కూడా మంజూరు చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళుతున్నము. దీని ద్వారా 2.8 టిఎంసి సాగునీరు అందుతుందన్నారు. పాత డిజైన్ ప్రకారం రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ,(కాళేశ్వరం) పనులు భూ సేకరణ ఇతరత్రా ఇబ్బందులను త్వరగా సమీక్షించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 80 శాతం వరకు నష్టపరిహారం అందించడం జరిగిందనీ, మొత్తం కేటాయించిన రూ.23 కోట్ల 15 లక్షల తో 100 శాతం నష్టపరిహారం అందించి పదిహేను రోజుల్లోపు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి 80 వేల ఎకరాలు, బాన్సువాడకు పదివేల ఎకరాలు, ఎల్లారెడ్డి కి 30 వేల ఎకరాలు, మెదక్ జిల్లా రామాయంపేటకు 12 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం.
కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తాను: అలాగే గోదావరి జలాలు పూర్తిస్థాయిలో పైప్ లైన్లు మరమ్మతు చేసి కొత్త పైప్లైన్ వేసి 20 సంవత్సరాల వరకు తాగునీటి కొరత రాకుండా చూస్తామని, వేసవికాలం వస్తున్నందున నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో, మునిసిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అవడంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధులైన, అధికారులైన ఇప్పుడు మీరే గ్రామాల్లో ఎలాంటి సమస్యలైనా పై అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలనీ అధికారులకు సూచించారు. విధుల్లో అలసత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండకుంటే వారిపై చర్యలు ఉంటాయన్నారు.
మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ.. అమృత్ కాల్ పథకంలో రూ.93 కోట్లతో తాగునీటి పనులు సమీక్ష జరపగా (గోదావరి జలాలు) 104 కిలోమీటర్ల నుండి రెండో పైపులైన్ పనులు ఇప్పటివరకు 24 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో రెండో లైను పూర్తవుతుందన్నారు. ఫారెస్ట్ పర్మిషన్లు ఇబ్బంది ఉంటే వెంటనే పై అధికారులతో మాట్లాడి పర్మిషన్లు వారంలో వచ్చేలా చూస్తామన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా 7200 ఉచిత నల్ల కలెక్షన్లు కొత్తవి ఇస్తున్నామన్నారు. ఈ వారంలో నల్ల కలెక్షన్ల పనులు మొదలవుతాయన్నారు. స్లమ్ ఏరియాలలో ఎక్కువ కలెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాలతో కలిపి 11 ఎం ఎల్ డి నీరు అవసరం ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 6 ఎం ఎల్ డి , బుర్ర మత్తడి నుండి 1ఎం ఎల్ డి , పెద్ద చెరువు నుండి 2.5 ఎం ఎల్ డి నీరు వస్తున్నాయన్నారు. రెండవ లైన్ పూర్తి అయితే ఎలాంటి నీటి సమస్యలు ఉండవు అన్నారు.
మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ .. వేసవి కాలం పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రత్యేక చర్య తీసుకుని ప్రతి ఒక్కరికి నీరు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, ఆర్డిఓ వీణ, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, బిబిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నా చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES