- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని కమల నెహ్రూ కాలనీలో వర్షానికి గుట్టకు దగ్గరలో ఉన్న ఓ బండరాయి గురువారం దొర్లుకుంటూ వచ్చి ఇంటి గోడను ధ్వంసం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితులు మీడియాతో అన్నారు. ఇంటి గోడ ధ్వంసం కావడంతో తమకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- Advertisement -