- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి స్వాతంత్ర సంబరం ఎందరో మహానుభావులు త్యాగఫలం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్,ఐలేని సంతోష్, బోడ హన్మండ్లు, దర్శనం రాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -