- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సోమవారం అంతర జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ఆయా పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలో , కొట్రా గ్రామంలో విద్యార్థులచే గ్రామంలోని పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి సంపూర్ణ అక్షరాస్యత పై పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రేమకుమారి, ఉపాధ్యాయులు రామారావు, చెన్నకేశవులు జాంగీర్, ధార్య, పి. విజయ్ కుమార్, రఘునందన్ , గ్రామ యువకులు పాల్గొన్నారు.
- Advertisement -