Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ 

జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ 

- Advertisement -

జిల్లా జడ్జి భరత లక్ష్మి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ జిల్లా, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ యొక్క ఆదేశాల మేరకు జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జ్ భరత లక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కోర్టు ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ నెల 14న లోక్అదాలత్  నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న కేసులను న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. జిల్లా వ్యాప్తంగా 1,680 కేసులు రాజీ కోసం ఎంపిక చేశామని వివరించారు. అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయభాస్కర్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad