- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ థెరిసా హైస్కూల్ లో శనివారము నేషనల్ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు పాఠశాలల విద్యార్థులు అనేక వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. సైన్స్ కు సంబంధించి వినియోగించే ఉపకరణాలను తయారు చేయడం, సైన్స్ కు సంబంధించి పలు చిత్రాలను ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కె రామలక్ష్మి, హెడ్ మాస్టర్ లు కే సుబ్బారెడ్డి, కే నరసింహారెడ్డి లు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
- Advertisement -



