Friday, September 19, 2025
E-PAPER
Homeకరీంనగర్తాడికల్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

తాడికల్ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని, శంకరపట్నం  మండలం తాడికల్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శుక్రవారం  ఘనంగా వేడుకలు జరిగాయి. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, ముఖ్య అతిథిగా పాల్గొని, క్రీడల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. అనంతరం, విద్యార్థులందరూ జాతీయ క్రీడా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆడెపు శ్రీనివాస్, ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేడుక క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా ప్రోత్సాహం అందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -