- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ ప్రాంగణంలో ఓటర్ ప్రతిజ్ఞను మద్నూర్ మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటుకు ఉన్న విలువను వివరించారు. అదే విధంగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం ఉదయం 11 గంటలకు మద్నూర్ మండల కేంద్రంలో ర్యాలీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి జడ్పీ సీఈవో చందర్ హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్ ఎం శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



