Saturday, June 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉద్యోగ, ఉపాధి కల్పించాలి: 9న దేశవ్యాప్త సమ్మె

ఉద్యోగ, ఉపాధి కల్పించాలి: 9న దేశవ్యాప్త సమ్మె

- Advertisement -

దేశాభివృద్ధికి ఒక ముఖ్యమైన కొలమానం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడం. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం.గత దశాబ్దకాలంగా అన్ని రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకా శాలు గణనీయంగా తగ్గిపోయా యి. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గత నాలుగున్నర దశాబ్దాల్లో ఇంతటి భారీ స్థాయిలో నిరుద్యోగం ఎన్నడూ లేదని స్పష్టంగా తన నివేదికలో తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసి, ఇండియన్‌ రైల్వేస్‌ వంటి సంస్థల్లో లక్షలాది ఖాళీలు భర్తీ కాకుండా ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు పది లక్షల ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటుకు తెలిపింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ, దేశం లోపల విపత్తులు సంభవించిన సమయాల్లో ఆదుకునే దేశ రక్షణ (ఆర్మీ) వ్యవస్థలో సైతం లక్షన్నరకు పైగా ఖాళీలు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అగ్నిపథ్‌ పథకం ఒక విఫల ప్రయోగం. హడావిడిగా దీన్ని ఏర్పాటు చేయడం, దీనిపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోక పోవడం, కనీసం సమీక్ష కూడా చేయకపోవడం కేంద్ర ప్రభుత్వానికే చెల్లింది! అగ్నివీర్ల సర్వీస్‌ను కేవ లం నాలుగేండ్ల వ్యవధికి పరిమితం చేయడం సరైంది కాదు. అతి తక్కువ కాలం మాత్రమే సేవలం దించి ఆ తర్వాత వాళ్లు ఏ రకంగా స్థిరపడగలరు? దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సి టీలు, కళాశాలలు, పాఠశాలలతో సహా మొత్తం విద్యారంగంలో అధ్యా పక, ఉపాధ్యాయ పోస్టులు లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.
దేశంలోని అనేక రంగాల్లో లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్థతుల్లో పని చేస్తున్నారు. వీరిలో అనేక మందికి నియామక పత్రాలు కూడా లేవు. లక్షలాది మంది తాత్కాలిక ఉద్యోగులకు పెన్షన్‌, పి.ఫ్‌, ఆరోగ్య బీమా వంటి కనీస సౌకర్యాలు కొరవడి పలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక విద్యా సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతుల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు పని చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగాలు కాకుండా తుమ్మితే ఊడిపోయే విధంగా ఉద్యోగాలు ఉంటే ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల నుండి అంకిత భావం, చిత్తశుద్ధి ఎలా ఆశించగలం? యూపీఏ-1 ప్రభుత్వ హయాం నుండి అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశానికి ఎంతో మేలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో లోపాలు ఎదురైనప్పటికీ, దీన్ని మరింత పటిష్టం చేసి ఏడాదికి కనీసం రూ 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయింపులు చేయగలిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దేశాభివృద్ధి ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కీలకం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రాధాన్యతను ఏ మాత్రం గుర్తించడం లేదు. అవసరమైన నిధులూ ఇవ్వడం లేదు. పైగా గ్రామీణ ఉపాధి హామీని అన్ని పట్టణాలకు విస్తరింప చేయాలని జాతీయ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఎప్ప టినుంచో కోరుతున్నా, దానిపై నోరుమెదపడం లేదు.
కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్‌ మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే డేటా ప్రకారం మే, 2025లో 15-29 సంవత్సరాల వయస్సు ఉన్న గ్రామీణ యువతలో నిరుద్యోగం రేటు 13.7 శాతానికి, అదే అర్బన్‌ యువతలో 17.9 శాతానికి పెరిగింది. మహిళల్లో అయితే నిరుద్యోగం 5.8 శాతానికి పెరిగింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ఇచ్చిన నివేదిక గత దశాబ్ద కాలంలో మొత్తం దేశం యువతలో నిరుద్యోగ రేటు 22 శాతానికి చేరుకుందని పేర్కొంది. మరో పక్క సాఫ్ట్‌ వేర్‌ రంగంలోని పరిస్థితులు కూడా ఏమంత సజావుగా లేవు. ఉద్యోగాల భద్రత కొరవడింది. పలు ఐ.టి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశాయి. సాంకేతిక పరిజ్ఞానం కేంద్రీకృతమవు తోంది. పలు కంపెనీల్లో వేతన స్తంభన నెలకొన్నది.
దేశ సంపద పెరిగింది. కానీ అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలందరికీ దక్కడం లేదు. ఇది మన వ్యవస్థ ప్రధాన వైఫల్యం. ప్రపంచంలో మన దేశ జీడీపీ ఏ స్థానానికి చేరుకున్నదనే దానికన్నా, ప్రజల ఆదాయాలు, పౌష్టికాహారం, విద్య,ఆరోగ్య సంరక్షణ, ఉపాధి కల్పన వంటి ముఖ్యమైన అంశాలను మాత్రమే దేశ ప్రగతి విషయంలో ప్రమాణికాలుగా తీసుకోవాలి.ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఉపాధి కొరత సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రజలు, ప్రజాతంత్రవాదులు, విద్యార్థులు, మేధా వులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి.
వి.వి.కె.సురేష్‌
9440345850

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -