Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'నవతెలంగాణ' క్యాషియర్‌కు పితృవియోగం

‘నవతెలంగాణ’ క్యాషియర్‌కు పితృవియోగం

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్‌
నవతెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయం (హైదరాబాద్‌)లో క్యాషియర్‌గా పనిచేస్తున్న మేనక తండ్రి ఇటికాల అంజయ్య ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన అంజయ్య బుధవారం సాయంత్రం పొలంలో పని చేస్తున్న సమయంలో అనుకోకుండా ఆయనపై చెట్టు పడింది. తీవ్ర గాయాలైన అతన్ని హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. గురువారం అంత్యక్రియలు జరిగాయి. కూతురు, అల్లుడు నవతెలంగాణ దినపత్రికలో పని చేస్తున్నారు. అంజయ్య మృతికి నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌, ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -