- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. భీంగల్ మండలంలో ఈరోజు జరిగిన నవోదయ పరీక్షలలో మండలంలోని జెడ్పిహెచ్ఎస్, కృష్ణవేణి టాలెంట్ విద్యాలయంలో శనివారం 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పరీక్షలు నిర్వహించారు. భీంగల్ జెడ్పిహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో 144 మంది విద్యార్థులకు 127 మంది, కేటీఎస్ పరీక్ష కేంద్రంలో 150 మంది విద్యార్థులకు 137 మంది పరీక్ష రాయడానికి విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ స్వామి తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాలలో కలిపి 30 మంది పరీక్షకు రాలేదని అన్నారు. శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు మండల విద్యాధికారి స్వామి తెలిపారు.
- Advertisement -



