- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఝార్ఖండ్లోని లాతేహార్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో కీలక నక్సలైట్ ఒకరు మరణించారు. మరో నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాతేహార్ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్లో రూ.5 లక్షల రివార్డు ఉన్న మనీశ్ యాదవ్ అనే నక్సలైట్ మరణించినట్టు పలామూ డీఐజీ వైఎస్ రమేశ్ ధ్రువీకరించారు.
- Advertisement -