Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్సిడీ మీద వేపనూనె, 13.0.45 రైతులకు అందజేత

సబ్సిడీ మీద వేపనూనె, 13.0.45 రైతులకు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగుల్గావ్ జిపి గ్రామం రైతువేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ యాసంగి పంటల యాజమాన్యం పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శెనగ పంటలో ఎండుతెగులు నివారణకు, పచ్చ పురుగు నివారణకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న  పంటలో ఎరువుల యాజమాన్యం పైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కత్తెర పురుగు నివారణకు వేపనూనె 1500 పిపిఎం , 500 ఎమ్ఎల్ ఎకరాకు దానితో పాటు ఏమమెక్టిన్ బెంజోయేట్ ( ఈఎమ్1) 100గ్రాములు కలిపి మొక్క సుడిలో పడేలా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. జొన్న పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు వేపనూనె 1500పిపిఎమ్, 500ఎమ్ఎల్ ఎకరాకు దానితో పాటు క్లోరిపైరిఫోస్ 50ఈసి 500ఎమ్ఎల్ ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.

జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ (ఎన్ఎఫ్ ఎస్ ఎన్ఎమ్ 2026)కింద సబ్సిడీ మీద రైతు సోదరులకు వేప నూనె, 13.0.45 అందచేయడం జరిగింది.  నూతనంగా వార్డు సభ్యులు సంతోష్  వ్యవసాయ శాఖ జుక్కల్ మండలం తరుపున సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈరోజు రైతువేదిక లో నిర్వహించిన సమావేశానికి రైతు సోదరులు రగోబ శ్రీనివాస్, శివరామ్ ప్రకాష్ , జుక్లె దేవీదాస్ , అబ్బాస్వర్ లక్ష్మణ్,జాదవ్ దామోదర్, ముత్యల్వర్ వీరేశం, సాయిరాం, శివరామ్ అశోక్ పటేల్,భగవత్ కుమార్,గోపాల్ రావు,హరి విటోభ పటేల్,రాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -