Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేతన్నకు భరోసా మార్కెట్ డెవలప్మెంట్  పథకం

నేతన్నకు భరోసా మార్కెట్ డెవలప్మెంట్  పథకం

- Advertisement -

చేనేత, జౌలిశాఖ సహాయ సంచాలకులు ఏ.శ్రీనివాస రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

నేతన్నకు నేతన్న భరోసా మార్కెట్ డెవలప్మెంట్ పథకం ప్రకారం  జియో ట్యాగింగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికుడు ఈ నేతన్న భరోసా పథకంలో అర్హత కలిగి ఉంటాడనీ చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఏ శ్రీనివాసరావు  కోరారు. 
ఒక సంవత్సరంలో గరిష్టంగా 8 వార్పులు అనగా 56 చీరలు కనిష్టంగా నాలుగు వార్పులు అనగా 28 చీరలు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ  ఉత్పత్తులపై తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ప్రత్యేక లోగోను  వేసి మార్కెట్లో అమ్ముకోవాల్సి ఉంటుందనీ. ఇలా కనీసం 50% చీరలు నేసిన చేనేత కార్మికుడికి సంవత్సరానికి  రూ 18000/- వారి అనుబంధ కార్మికుడికి  రూ 6000/- నేరుగా ఖాతాలో జమ చేయడం జరుగుతుందనారు.

ఈ మొత్తాన్ని ఆరు మాసాలకి సగం చొప్పున ఇవ్వడం జరుగుతుందనీ , ఈ పథకంలో చేనేత కార్మికులు  నమోదు కావాలంటే చేనేత కార్మికుడి , అనుబంధ కార్మికుల యొక్క వివరాలు పొందుపరిచి న దరఖాస్తు  ఫారం ఎ,   తెలంగాణ చేనేత లేబుల్ కొరకు దరఖాస్తు ఫారం బి  లను, చేనేత జౌళి శాఖ అధికారులు ఆయా గ్రామాలలో పర్యటించి తగు అవగాహన కల్పించి , స్వీకరించడం  జరుగుతుందనారు. దరఖాస్తు ఫారం తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీలు జమ చేయవలసి ఉంటుందనీ , జిల్లాలోని చేనేత కార్మికులు అందరూ కూడా తమ తమ దరఖాస్తులను మీ గ్రామాలకు 22 జూలై 31 జులై వచ్చినటువంటి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -