- Advertisement -
ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా మార్కెట్లోకి 2 సిరీస్ గ్రాన్ కూపేను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రారంభ ధరను రూ.46.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ సెడాన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 154 బీహెచ్పీ, 230 ఎన్ఎమ్ టార్క్తో రెండు వేరియంట్లలో (218 ఎం స్పోర్ట్, ఎం స్పోర్ట్ ప్రో) అందుబాటులో ఉందని వెల్లడించింది. కొత్త 2 సిరీస్ గ్రాన్ కూపే స్టైల్, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనమిక్స్లో బీఎండబ్ల్యూ స్పోర్టీ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆ కంపెనీ సీఈఓ విక్రమ్ పాV్ా తెలిపారు.
- Advertisement -