- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేశ్ ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయ వృత్తిని ప్రారంభించారు.
- Advertisement -