నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని కొన సముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గ్రామంలో అన్ని కులాల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షులుగా మెల గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా శెట్టిపల్లి గంగాధర్, కోశాధికారిగా కంతి గంగాధర్, సలహాదారులుగా సామ బాపు రెడ్డి, కాలేరు రాజేశ్వర్, చిలమెల గంగాధర్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. గ్రామ ప్రజలు కూడా గ్రామ అభివృద్ధి కమిటీ సహకరించి గ్రామంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు.
కొన సముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES