- Advertisement -
హైదరాబాద్ : బంధన్ మ్యూచువల్ ఫండ్ తొలిసారి సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ అయినటువంటి బంధన్ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ బిఎస్ఇ 500 ఇండెక్స్లోని 21 రంగాల్లోని అగ్రశ్రేణీ మూడేసి చొప్పున కంపెనీలపై దృష్టితో పని చేస్తుందని పేర్కొంది. ఈ కొత్త ఫండ్ సెప్టెంబర్ 3 నుండి 17 వరకు తెరిచి ఉంటుందని వెల్లడించింది. కనీస పెట్టుబడిని రూ.1000గా నిర్ణయించింది. ఇది లార్జ్ క్యాప్ ఫోకస్, తక్కువ రిస్కుతో దీర్ఘకాలిక విలువ కోసం ఉద్దేశించబడిందని బంధన్ ఎఎంసి సీఈఓ విశాల్ కపూర్ తెలిపారు.
- Advertisement -